pizza
CM Relief Fund (AP) cheque handover to Journalist Sathyanarayana
జర్నలిస్ట్ కు అండగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు
You are at idlebrain.com > News > Functions
Follow Us


8 November 2018
Hyderabad


నిత్యం వార్తలు మోసే జర్నలిస్ట్ ల కుటంబాలలో ఏదైనా ప్రమాదం జరిగితే మేమున్నాం అంటూ రెండు తెలుగు రాష్ట్ర ల ముఖ్య మంత్రులు భరోసా ఇచ్చారు. 20 సంవత్సరాలుగా ఈ టివి లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సత్యన్నారాయణ కొన్ని నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ తో హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ఖరీదైన వైద్యం అందించేందుకు ఆ కుటుంబం ఆర్దికంగా బలమైనది కాదు. ఆ కష్టం తెలిసిన జర్నలిస్ట్ ల చొరవతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఆ కుటుంబం ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సియమ్ రిలీఫ్ ఫండ్ నుండి 9లక్షలు అందించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియమ్ రిలీఫ్ ఫండ్ నుండి 7లక్షలు అందించారు. ఇంకా సినిమా ప్రముఖులు, మేనేజర్స్, తోటి జర్నలిస్ట్ ల సహాకారంతో సత్యన్నారాయణ కు పెద్ద ఊరట కలిగింది.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, టిడిపి నేత మురళీ మోహాన్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆనారోగ్యంతో బాధ పడుతున్న జర్నలిస్ట్ సత్యన్నారాయణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఏడు లక్షల చెక్ ను అందించారు.

ఈ పత్రికా సమావేశంలో
నటుడు బెనర్జీ మాట్లాడుతూ:
‘‘జర్నలిస్ట్ లను మేము ఎప్పుడూ వేరుగా చూడలేదు. మా ఎదుగుదలలో వారు ఎప్పుడూ ఉంటారు. వారి కి ఏదైనా కష్టం వస్తే మేము స్పందించడానికి వేనకడుగు వేయం. సత్యన్నారాయణ గారు తర్వగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.

మా అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ:
‘‘జర్నలిస్ట్ లు ఎప్పుడూ మా ఏదుగదలలో బాగంగానే చూస్తాము. ‘ మా ’ అసోసియేషన్ ఎప్పుడూ ఇలాంటి పనులకు ముందుంటుంది. మూవీ ఆర్టిస్ట్ లే కాదు మాముందుకు కష్టం ఉందని ఎవరు వచ్చినా మాకు చేతనైన సహాయం చేస్తాం ’’ అన్నారు.

నటి అనితా చౌదరి మాట్లాడూతూ:
‘‘ మేము ఎప్పుడు జర్నలిస్ట్ లను కలిసినా కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపిస్తుంది.
మా ఇంట్లో పండుగలు పెద్దగా జరుపుకోము. ఏదైనా పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలంటే అనాథ శరణాలయంకు కానీ, ఓల్టేజ్ హోమ్ కి కానీ వెళ్లి అక్కడ వారితో జరుపుకుంటాం. సత్యన్నారాయణ గారికి ఇలా జరిగింది అని తెలియగానే మా కుటంబంలో ఒకరికి జరిగనట్లు అనిపించింది.‘ మా’ తరుపున కూడా వారికి సహాయం అందించాం ’’ అన్నారు.

నటుడు, పార్లమెంట్ మెంబర్ మురళీమోహన్ మాట్లాడుతూ:
‘‘సినిమా పరిశ్రమలో ఎవరికైనా సహాయం అందించడానికి ఎప్పుడూ ‘మా’ ముందుంటుంది. తెలుగు దేశం ప్రభుత్వం కూడా సినిమా పరిశ్రమకు సహాయం అందించడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. సినిమా జర్నిలస్ట్ లను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతాను. వారి మాకు శ్రేయాభిలాషులు, స్నేహితులల్లాగా మాతో మెలుగు తారు. సత్యనారాయణ గారి ఆరోగ్యం గురించి నాకు తెలిసినప్పుడు నేను పర్సనల్ గా చంద్రబాబు గారితో మాట్లాడాను. నేను ఏడు లక్షలు ఇస్తే బాగుంటుంది అంటే వెంటనే చెక్ రాసి ఇచ్చారు. తెలుగు ఇండస్ట్ర్రీ లో ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా ఆయన ఎప్పుడూ ముందుంటారు. జర్నలిస్ట్ లందరూ వచ్చి అమరావతి లో ఇళ్ళ విషయంలో తప్పకుండా సహాయం చేయడానికి సిద్దంగా ఉంటుంది. జర్నలిస్ట్ లను కుటుంబ సభ్యులుగా బావిస్తాము. తెలంగాణా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సత్యనారాయణ కుటుంబానికి 9లక్షలు అందించినందుకు సంతోషంగా ఉంది.’’ అన్నారు.

జర్నలిస్ట్ సత్యనారాయణ మాట్లాడుతూ:
‘‘ నేను తీవ్ర ఆనారోగ్యం తో బాధ పడుతున్నప్పుడు నాకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్ర్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు, నాతోటి జర్నలిస్ట్ లకు, నటీ నటులకు, పిఆర్వోలకు, అందరికీ ధన్యవాదాలు. నేను కోలుకుంటానని అనుకోలేదు, మీ అందరి ఆశిస్పులే నన్ను కాపాడాయి’’ అన్నారు.

సత్యనారాయణ కు అండగా నిలిచిన వారిలో
‘‘ మంచు లక్ష్మి ( నటి), క్రిష్ జాగర్లమూడి ( దర్శకుడు) దిల్ రాజు ( నిర్మాత) హారి( మేనేజర్), మహేంద్ర (మేనేజర్), మారుతి (దర్శకుడు), వల్లి (కీరవాణి గారి భార్య), పీపుల్స్ మీడియా ప్రసాద్ గారు, వంశీ శేఖర్ ( పిఆర్వో), ఠాగూర్ మధు(నిర్మాత), నాగశౌర్య( హీరో), జివి( జర్నలిస్ట్), మహేష్ కోనేరు( నిర్మాత), జిఎ2 బన్నీవాసు( నిర్మాత), బెల్లంకొండ శ్రీను( హీరో), సి. కళ్యాణ్ (నిర్మాత), మైత్రి మూవీస్ , మాక్స్ మీడియా సాయి, సుమరాజీవ్ కనకాల ’’ఉన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved