గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ కోసం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఫండ్ రైజింగ్ కోసం ప్రముఖ గాయని, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కె.ఎస్చిత్ర మ్యూజిక్ కన్సర్ట్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.
వి కేర్ ప్రతినిధి గౌతమ్ మాట్లాడుతూ - ``రేపు వి కేర్ ఆధ్వర్యంలో చిత్ర గారి కన్సర్ట్ను శిల్పకళా వేదికలో ఆర్గనైజ్ చేస్తున్నాం. చిత్రగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 6 జాతీయ అవార్డులు, 8 ఫిలింఫేర్ అవార్డులు, 12 భాషల్లో 25వేలకు పైగా పాటలు పాడిన ఘనత చిత్ర గారిది. వారు మా ఇన్విటేషన్ను యాక్సెప్ట్ చేసి.. చారిటీ కోసం చేస్తున్న మా ప్రోగాంలో పాల్గొనడానికి రావడం మా అదృష్టం. మా గౌరవంగా భావిస్తున్నాం`` అన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత సింగర్ కె.ఎస్.చిత్ర మాట్లాడుతూ - ``రేపు ప్రోగ్రాంలో పాడబోయే పాటలను ఇప్పటికే కొన్నింటిని ప్రాక్టీస్ చేశాం. కొన్నింటిని శ్రీరాం, కొన్నింటిని శ్రీనిధి పాడుతున్నారు. సాకేత్, సోని సహా అందరూ మీకు పరిచయమున్న మ్యూజిషియన్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అన్ని తెలుగు పాటలనే పాడుతున్నారు. మంచి కాజ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం. కాబట్టి అందరూ దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మూడు గంటల పాటు సాగుతుంది.
కన్సర్ట్లో పాల్గొంటున్న సింగర్స్ అందరూ పాల్గొని రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.