12 April 2019
Hyderabad
సాయితేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మించిన చిత్రం `చిత్రలహరి`. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా...
నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - ``గురువారం ఎన్నికల వేడి అంతా పూర్తయిన తర్వాత శుక్రవారం మా సినిమా విడుదల కావడం.. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేశారు. వారందరూ హ్యాపీగా ఉన్నారు. ఆదివారం కంతా బ్రేక్ ఈవెన్ అయిపోతామని అందరూ అంటున్నారు. సోమవారం నుండి ప్రాఫిట్ జోన్లోకి వెళతామని చెప్పారు. మార్నింగ్ షో కంటే మ్యాటీకి కలెక్షన్స్ మరింత పెరిగాయి. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతాయనే భావిస్తున్నాం. తేజుగారికి, కిషోర్గారికి థాంక్స్`` అన్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ - ``మేం ఏ సక్సెస్ కోసమైతే కష్టపడ్డామో ఆ సక్సెస్ను అందించిన మా ప్రేక్షకులకు థాంక్స్. అందరూ హ్యాపీగా ఉన్నారు. యూత్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కనెక్ట్ అవుతున్నారు`` అన్నారు.
సుప్రీమ్ హీరో సాయి తేజ్ మాట్లాడుతూ - ``ప్రేక్షకులు, మీడియా సపోర్ట్తో సినిమా మంచి సక్సెస్ అయ్యింది. నా క్యారెక్టర్ను చూసుకుంటున్నాను అంటూ అందరూ చెబుతున్నారు. బాయ్ నెక్స్ట్ డోర్లా ఫీల్ అవుతున్నారు. ప్రేక్షకుల వారి ఎమోషన్స్, హ్యాపీనెస్ను వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్స్ బావున్నాయి. చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్లో కూర్చుంటున్నాను. ఎవరైతే సినిమాకు కనెక్ట్ అయ్యే వారితో పాటు మా టీం విక్టరీ. మెగా ఫ్యాన్స్కు థాంక్స్. ఈ సక్సెస్ ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాను`` అన్నారు.