ప్రముఖ నిర్మాతదిల్ రాజు సమర్పణలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి కథ, స్క్రీన్ప్లే అందించగా మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘రోజులు మారాయి’. మురళీకష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. జూలై 1న సినిమా విడుదలవుతుంది. ఇటీవల జె.బి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
సంగీత దర్శకుడు జె.బి మాట్లాడుతూ ``రోజుల మారాయి సినిమా పాటలు రీసెంట్గా రిలీజ్ అయ్యాయి. సాంగ్స్ అన్నింటికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్రాజు, మారుతిగారికి థాంక్స్. దిల్రాజుగారు కూడా సినిమాలో భాగమవుతున్నారు. ఆయన సినిమాలో మ్యూజిక్ చేయాలా అని కొద్దిగా భయపడ్డాను. అయితే ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఈ చిత్రంలో కాసర్ల శ్యామ్ నాలుగు పాటలు, కిట్టు ఒక పాటను రాశారు. సింగర్స్ చాలా చక్కగా పాడారు. పాటలను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు థాంక్స్`` అన్నారు.
కాసర్లశ్యామ్ మాట్లాడుతూ ``ఈరోజుల్లో సినిమా నుండి నాకు జెబిగారితో అనుబంధం ఉంది. ఆయన మ్యూజిక్లో వచ్చే సినిమాలకు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ సినిమాలో నాకు 4 పాటలు రాసే అవకాశాన్ని కలిగించారు ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జెబిగారు మంచి సంగీతంతో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ఆడియో హిట్ అయినట్లే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో రమ్యబెహర, అనుదీప్, రోహిత్, లిప్సిక, నయన తదితరులు పాల్గొన్నారు.