కార్తి, సయేషా సైగల్ జంటగా 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్పై సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతలుగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `చినబాబు`. ఈ సినిమా జూలై 13న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సక్సెస్ మీట్లో...
హీరో కార్తి మాట్లాడుతూ - ``మన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుగారు సినిమా చూసి యూనిట్ను అభినందిస్తూ మెసేజ్ పోస్ట్ చేయడం ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తి అలా అప్రిషియేట్ చేయడం వల్ల ఏ నమ్మకంతో ఈ సినిమా చేశామో అది ఇంకా పెరిగింది. ఆయన మమ్మల్ని ప్రశంసించడం గౌరవంగా భావిస్తున్నాం. అందరికీ ఫ్యామిలీ ఎమోషన్స్ పెరిగిపోయాయి. చిన్న కుటుంబాలు పెరిగిపోతున్న ఈరోజుల్లో .. ఈ సినిమా చూసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. రవీందర్ వైజాగ్, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో తిరిగాను. చిన్న చిన్న ఊర్లో థియేటర్స్ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి. నిన్న నైట్ వర్షం పడుతున్నప్పుడు కూడా హౌస్ ఫుల్ ఫోతో సినిమా రన్ అయ్యింది. అన్నయ్యతో కలిసి సినిమా చేశాను కాబట్టి ఈ సినిమా చాలా స్పెషల్గా భావిస్తున్నాను. అందరూ ఫ్యామిలీలతో కలిసి చూస్తున్నారు. ఇంత పెద్ద ఆనందాన్ని ఇచ్చిన ప్రేక్షకులను నేరుగా కలుసుకున్నాను`` అన్నారు.
మిర్యాల రవీందర్ మాట్లాడుతూ ``సినిమాకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు సినిమా చూస్తారట.. క్యూబ్ లైసన్స్ కావాలని అడిగారు. సార్.. అంత బిజీగా ఉంటారు కదా.. సినిమా చూస్తారా? అనుకున్నాను. ఆయన సినిమా చూడటమే కాదు.. ట్వీట్ కూడా చేశారు. రైతు ఫ్యామిలీస్లోని రిలేషన్స్, ఉమ్మడి కుంటుబాల్లోని బంధాలు, బంధుత్వాలు గురించి ఆయన వ్యక్తిగతంగా ట్వీట్ చేశారు. తెలుగు, తమిళ నెటివిటీకి చాలా దగ్గరున్న సినిమా అని ఆయన చెప్పడం మాకు సంతోషంగా ఉంది. సినిమా చూసిన వాళ్లందరూ ఆనందంతో బయటకు వస్తున్నారు`` అన్నారు.
సయేషా సైగల్ మాట్లాడుతూ - ``పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించడం కొత్తగా అనిపించింది. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.