రష్మిక మందన్నా `గీతా..ఛలో` చిత్రం ఏప్రిల్ 26న విడుదల కానుంది. శ్రీ రాజేశ్వరి ఫిలింస్, మూవీ మ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్, దుగ్గి వలస శ్రీనివాస్ నిర్మాతలు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రెస్మీట్లో ..
నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ - ``కామెడి, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచి టీం పనిచేశారు. ఏప్రిల్ 26న సినిమా విడుదలవుతుంది.17న ఆడియో విడుదల చేస్తాం. 21న వైజాగ్ కళాభారతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నిర్వహిస్తాం`` అన్నారు.
ముత్యాల రాందాస్ మాట్లాడుతూ - ``ట్రైలర్ యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. రష్మిక సూపర్హిట్ సినిమాల హీరోయిన్. ఆమె నటించిన ఈ సినిమా మరో హిట్ అవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ``ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తున్నారు. మంచి డిస్ట్రిబ్యూటర్స్గా పేరు తెచ్చుకున్న వారే ఈ సినిమాకు నిర్మాతలుగా పనిచేస్తున్నారు. గీత గోవిందం, ఛలో వంటి సక్సెస్ఫుల్ మూవీస్లో నటించిన రష్మికనే ఈ సినిమాకు అసలు హీరోయిన్`` అన్నారు.