నవకళ పారి పతాకంపై రత్న దర్శకత్వంలో శశాంక మౌళి, పావని జంటగా శ్రీను విజ్జగిరి, ప్రసాద్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నసినిమా ‘కత్రిన కరీన మధ్యలో కమల్ హాసన్’. ఈ సినిమా ట్రైలర్ విడుదలను గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా....
దర్శకుడు రత్న మాట్లాడుతూ ‘‘’సినిమా అవుటండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. వైజాగ్ బ్యాక్ డ్రాప్లో నడిచే కథ. సినిమాను మొత్తాన్ని 47 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కొత్త వాళ్ళతో చేసిన సినిమా. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తుంటారు..? నలుగురు అమ్మాయిలు ఒక దగ్గర కూర్చుంటే అబ్బాయిల గురించి ఏం మాట్లాడతారు..? అనే ఆసక్తికరమైన అంశాలతో సినిమా సాగుతుంది. ఇందులో5 పాటలుంటాయి. ఏప్రిల్ చివరి వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత విజ్జగిరి మాట్లాడుతూ ‘స్టోరీ నచ్చంది. అలాగే దర్శకుడు నెరేషన్ నచ్చడంతో సినిమాను నిర్మించాను. సినిమా అవుట్ పుట్ అనుకున్న విధంగా సినిమా వచ్చింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో శశాంక్ మాట్లాడుతూ ‘’కామెడి అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి కథే హీరో. ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు తగ్గట్లుగా సినిమా ఉంటూ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతకు కృతజ్ఞతలు’’ అన్నారు.