గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణి కుమార్ నిర్మాతలుగా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ `వెంకటాపురం`. హ్యాపీడేస్ ఫేం హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. వేణు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మే 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా `వెంకటాపురం మ్యూజిక్ డైరెక్టర అచ్చుతో ఇంటర్వ్యూ...
అచ్చు మాట్లాడుతూ - ``వెంకటాపురం సినిమాను నిజ ఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఒక్కొక్క సినిమాకు ఒక్కో తరహా సంగీతం అందిస్తాం ఉదాహరణకు లవ్స్టోరీ అయితే ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలనే దానిపై మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ నిజ ఘటనలు ఆధారంగా సినిమా చేయాలనుకోగానే అసలు కంటెంట్ ఏంటి, దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేదే ముఖ్యం. వెంకటాపురం డిఫరెంట్ జోనర్లో తెరకెక్కింది. దర్శకుడు వేణు కొత్త స్క్రీన్ప్లేతో సినిమాను తెరకెక్కించాడు. సాయిప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది. మంచి యంగ్ టీంకు పనిచేసింది. హ్యాపీడేస్తో పోల్చితే రాహుల్ ఈ సినిమాలో కొత్తగా కనపడతాడు. ఈ సినిమా కోసం సిక్స్ప్యాక్ చేశాడు.
డబ్బుల కోసమే సినిమాలు చేయను. స్పీడుగా వర్క్ చేయడం కంటే సరైన సమయంలో అవుట్పుట్ ఇవ్వడమనే దానినే నేను నమ్ముతాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్స్ రాత్రి వేళల్లో పనిచేస్తారు. కానీ ఉదయం పూట పనిచేయడానికి ఇష్టపడతాను. సినిమాలను సెలక్టివ్గా ఎంచుకుంటాను`` అన్నారు.