సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బస్తీ'. వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో వాసు మంతెన నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. జూలై 3న చిత్రాన్ని విడుదల చేయనున్నామని వాసు మంతెన చెప్పారు.
ఈ సందర్భంగా వాసు మంతెన మాట్లాడుతూ - ''ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అనుకోకుండా ఎదురైన ఓ సమస్యను ఓ జంట ఎలా పరిష్కరించుకుంది? అనేది ప్రధానాంశం. శ్రేయాన్ హ్యాండ్ సమ్ గా ఉంటాడు. నటనపరంగా కూడా అందర్నీ మెప్పిస్తాడు. అంత అద్భుతంగా నటించాడు. కథానాయిక ప్రగతి కూడా బాగా నటించింది. కథ, కథనం ఈ చిత్రానికి ఓ హైలైట్ గా నిలుస్తాయి. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది'' అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: వడ్డాలపు ప్రభాకర్, ముని రాయపురెడ్డి, కెమెరా: వి.కె. గుణశేఖర్.