మాస్మహరాజ్ రవితేజ, అందాల భామలు తమన్నా, రాశిఖన్నాలు జంటగా, సంపత్ నంది దర్వకత్వంలో, నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్టైగర్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న విడుదలవుతుంది. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ప్రతిచిత్రం కూడా ప్రమెషన్ పరంగా దూసుకువెల్లటమే కాకుండా వినూత్నంగా ప్రమోట్ చేయటం ఈ సంస్థకి పెట్టింది పేరు. ఇప్పటికే ప్రమోషన్ లో దూసుకుపోతున్న బెంగాల్ టైగర్ చిత్రం మేజర్ గా అన్ని సిటీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన అన్ని చోట్లా విపరీతంగా ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతుండటం ఈ సినిమాకి వున్న క్రేజ్ ని తెలియజేస్తుంది. అందరి అంచనాలు అందుకుని మెదటిరోజు భారీ వసూళ్ళ వైపు వెల్లనుందని ట్రేడ్ వర్గాలు అంచనాలున్నాయి..