8 October 2016
Hyderabad
దర్శక నిర్మాతగా సినీ రంగంలో తన కంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న రాజ్ కందుకూరి ఈ ఏడాది పెళ్ళిచూపులు చిత్రాన్ని నిర్మించి సెన్సేషనల్ హిట్ సాధించారు. ఈ సినిమా 75 రోజులను పూర్తి చేసుకుని 100 రోజులు దిశగా పయనిస్తుంది. రేపు(అక్టోబర్9న) రాజ్ కందుకూరి పుట్టినరోజు ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడారు...
కంటెంట్పై నమ్మకంతోనే....
-పెళ్లిచూపులు చిత్రం 75 రోజులను పూర్తి చేసుకుని వందరోజులు దిశగా వెళుతుంది. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. చిన్న బడ్జెట్తో చేసిన ఈ సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలని నేను, సురేష్ బాబుగారు ఆలోచన చేసినప్పుడు , స్పెషల్ షోస్ వేద్దామనే ఆలోచన ఇద్దరికీ వచ్చింది. అందువల్ల సినిమా విడుదలకు ముందే స్పెషల్ షోస్ వేశాం. కంటెంట్ బావుండంతో మేం స్పెషల్ షోస్ నిర్ణయం తీసుకున్నాం. - గౌతమబుద్ధ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను తొలి చిత్రంతో నందిఅవార్డు, దలైలామా అవార్డు, వంశీ అకాడమీ అవార్డు వచ్చింది. తొమ్మిదేళ్ల సినీ జర్నీలో పది సినిమాలు చేశాను. కానీ పెళ్లిచూపులు సక్సెస్ నాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. కంటెంట్ను నమ్మడంతో కొత్త టీంతో చేయడానికి నిర్ణయం తీసుకున్నాను.
చాలా మంది హీరోను బడ్జెట్ ఇంత ఉంది...అంటూ స్టార్ట్ చేస్తారు. హీరో బడ్జెట్ సినిమాకు ముఖ్యమే కాదనను. అయితే సినిమా కంటెంట్ కూడా చాలా ముఖ్యం. మంచి కథను తయారు చేసుకుని దానికి ఏ హీరో సరిపోతాడో అతని సినిమా చేస్తే మంచి విజయాన్ని సాధిస్తుంది. నా ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్లో ఒకట్రెండు కోట్ల బడ్జెట్తో కొత్తవాళ్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతాను. భవిష్యత్లో ధర్మపథ క్రియేషన్స్, రాజ్ కందుకూరి అంటే కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తాడనే పేరుంటే చాలు. పెళ్ళిచూపులు సినిమా నాకు తెచ్చిన పెట్టిన విజయం మరచిపోలేనిది. ఇలాంటి సినిమా చేయడం నిజంగా ఒక వరం.
రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్, శాటిలైట్ హక్కులు సహా 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్లో సురేష్బాబుగారు మెయిన్ పిల్లర్లాగా నిలబడ్డారు. ఆయన అండతో సినిమా రీచింగ్ చాలా ఎక్కువ రేంజ్లో అయ్యింది. ఇకపై ఏడాదికి ఓ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే నా డైరెక్షన్లో కూడా సినిమా చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఐబిఎం సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసిన ఒక వ్యక్తి సినిమాలపై ఆసక్తితో మంచి సినిమా కథను తయారు చేసుకుని నా వద్దకు వచ్చాడు. కథ నచ్చడంతో విజయదేవర కొండ హీరోగా సినిమా చేస్తున్నాం. అలాగే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సైన్మా సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం కథను తయారుచేస్తున్నాడు. ఆ సినిమా ప్రారంభం కావడానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. అలాగే ఓ స్టార్ హీరోతో కూడా సినిమా చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తానంటూ తెలియజేశారు నిర్మాత రాజ్ కందుకూరి..
Raj Kandukuri Birthday interview |
|
|
|