2 January 2015
Hyderabad
పంపిణీ రంగంలో విజయవంతంగా దూసుకెళుతున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. గత ఏడాది 'శ్రీమంతుడు'తో పాటు పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన అభిషేక్ పిక్చర్స్ త్వరలో విడుదల కానున్న 'నాన్నకు ప్రేమతో' పంపిణీ హక్కులను దక్కించుకుంది. తొలి ప్రయత్నంగా తమ సంస్థపై భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు సంస్థ అధినేత అభిషేక్. ఆ చిత్రవిశేషాల్లోకి వస్తే...
భారీ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించి, సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో అభిషేక్ ఓ చిత్రం నిర్మించనున్నారు. 'అల్లుడు శ్రీను'తో మంచి మాస్ హీరో మెటీరియల్ అనిపించుకుని, ప్రస్తుతం 'స్పీడున్నోడు' చిత్రంలో నటిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నామనీ, భవిష్యత్తులో కూడా మా సంస్థ నుంచి భారీ చిత్రాలు వస్తాయని అభిషేక్ తెలిపారు. సాయి శ్రీనివాస్ పుట్టినరోజు (03.01.) సందర్భంగా ఈ చిత్రం గురించి అభిషేక్ అధికారికంగా ప్రకటించారు.