28 October 2017
Hyderabad
భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి వి4 క్రియేషన్స్ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్పై 'నెక్స్ట్ నువ్వే' పేరుతో ఓ హార్రర్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి టి.వి. యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మాత. నవంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ ``ప్రభాకర్గారు ముందు మా వద్దకు వేరే కథతో వచ్చారు. ఆయన చెప్పిన కథ నచ్చలేదు. అయితే ఆయన చెప్పిన విధానం నచ్చింది. తర్వాత ఆయన చెప్పిన మరో కథే `నెక్ట్స్ నువ్వే`. ఇది ఓ తమిళ సినిమాకు రీమేక్. సినిమాలోని ఎంటర్టైన్మెంట్ నచ్చడంతో సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యాను. తమిళం నుండి తెలుగులోకి రీమేక్ చేసే సమయంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మన నెటివిటీకి దగ్గరగా సినిమాలో మార్పులు చేర్పులు చేశాం. ఇక ముందు ఈ సినిమాను వేరే హీరోతో అనుకున్నప్పటికీ కుదరలేదు. ఆ సమయంలో ఆదితో చేస్తే బావుంటుంది కదా అనిపించి తనను అప్రోచ్ అయ్యాం. ఆరవింద్గారు ఆరవైయేళ్ల టీనేజర్. ఆయనొక వంద పేజీల పుస్తకం అయితే నేనొక ఇరవై పేజీలు చదువుంటానంతే. ఎప్పుడూ అప్డేట్లో ఉంటారాయన. ఆయనతో నేను, జ్ఞానవేల్ రాజా, యు.వి.క్రియేషన్స్ కలిసి వీ4 మూవీస్ బేనర్ పెట్డడం ఆనందంగా ఉంది. ఈ బ్యానర్లో యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. ఆ దిశగా ముందుకెళుతున్నాం. ఇక బన్ని మూవీ నా పేరు సూర్య సినిమాను ఏప్రిల్ 27నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం`` అన్నారు.