12 October 2017
Hyderabad
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై చేతన్ మద్దినేని, డింపుల్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'గల్ఫ్'. పి.సునీల్కుమార్ రెడ్డి దర్శకుడు. యక్కలి రవీంద్రబాబు, యవమ్.రామ్కుమార్ నిర్మాతలు. సినిమా అక్టోబర్ 13న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా హీరో చేతన్ మద్దినేని మీడియాతో మాట్లాడుతూ ''మారుతిగారి 'రోజులు మారాయి' సినిమా తర్వాత నేను నటించిన చిత్రం 'గల్ఫ్'. ఈ సినిమాలో ఓ చేనేత కార్మికుడి కొడుకుగా కనపడతాను. గల్ఫ్ దేశాల్లోని స్నేహితులు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని భావించి గల్ఫ్కు నిర్మాణ రంగంలోకి కూలీగా వెళతాను. సినిమా, నా పాత్ర రియలిస్టిక్గా ఉంటుంది. అలాగని కేవలం కష్టాలే సినిమాలో చూపించరు. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్తో దర్శకుడు సునీల్కుమార్రెడ్డిగారు సినిమాను తెరకెక్కించారు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్సాల్సి రావడంతో నాలుగైదు సార్లు డైలాగ్స్ను చదివి నేర్చుకుని మరీ చెప్పాను. సత్యానంద్గారి వద్ద ట్రయినింగ్ తీసుకుంటున్నప్పుడే సునీల్కుమార్రెడ్డిగారిని కలిశాను. అయితే సునీల్గారు అప్పుడు ఈ సినిమాకు సంబంధించి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలని చెప్పారు. రెండేళ్లు పాటు సునీల్కుమార్గారు వర్కవుట్ చేసి కథను తయారు చేశారు. తెలంగాణ యాస్ అంత సులభంగా రాలేదు. అందుకని తెలంగాణ లెక్చరర్ను పిలిపించుకుని, యాస నేర్చుకున్నాను. తెలంగాణ యాస ప్రధానంగా వచ్చిన సినిమాలను కొన్నింటిని చూశాను. కమర్షియల్ యాంగిల్లో నటించడానికే కాక, మంచి నటనను ప్రదర్శించడానికి ఆస్కారముండే పాత్రను సునీల్కుమార్రెడ్డిగారు ఇచ్చారు. తదుపరి మారుతిగారి ప్రొడక్షన్లో 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమా చేస్తున్నాను. ఇది కన్నడ రీమేక్