జెమిని కిరణ్ గా మీడియాకి సినీవర్గాలకి సుపరిచితుడైన పర్వతనేని కిరణ్ గారు "తెలుగు ఫిల్మ్ ఛాంబర్" అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిగారు ఆయన్ని పూల బొకేతో సత్కరించారు.
పరిశ్రమ మంచి చెడులపై పూర్తి అవగాహన ఉన్న పి.కిరణ్ వంటి వ్యక్తి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిలో ఉండడం పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని చిరంజీవి ఆకాంక్షించారు.