రత్న మేఘన క్రియేషన్స్ పతాకం పై శ్రీరాముల నాగరత్నం సమర్పిస్తున్న చిత్రం 'చివరి క్షణం'. ధర్మ దర్శకత్వంలో ఆదిత్య శశాంక్, కవిత మహతో హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ చేతులమీదుగా విడుదల గావించారు. విడుదలైన అనతి కాలంలోనే ఫస్ట్ లుక్ కు విశేష స్పందిన లభించడం గమనార్హం. ఈ సంధర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సోమవారం హీరో శ్రీకాంత్ గారు మాచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందుకు ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. అయన విడుదల చేసిన కొద్ది సమయంలోనే విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఇక ఈ 'చివరిక్షణం' సినిమా విషయానికి వస్తే హైదరాబాద్, మంచిర్యాల లొకేషన్స్ లో టాకీ పార్ట్ మరియు ఒక సాంగ్ ను షూట్ చేసాము. మిగిలిన మూడు పాటలను గోవాలో షూట్ చేశాము. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి అతి త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలియచేసారు.