17 June 2015
Hyderabad
పాటల రికార్డింగ్తో మొదలైన ‘చోరి’
యువ ప్రతిభాశాలి ప్రభాస్ నిమ్మలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘మై టీమ్ వర్క్ క్రియేషన్స్’ పతాకంపై యువ నిర్మాత కిషోర్ కౌశిక్ నిర్మిస్తున్న చిత్రం ‘చోరి’. ప్రీతమ్, తేజ, రోసి హెలెన్, నళిని, రచ్చ రవి, కిషోర్, దీపక్, ప్రశాంత్, కోసబోయిన శ్రీను, రాము, సుధాకర్ నిమ్మల, విష్ణు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పాటల రికార్డింగ్తో ఈ చిత్ర రూపకల్పన పనులు మొదలయ్యాయి. ‘మావో మావో మావ.. మందుపాతర లాంటిది ప్రేమ... మైకం కమ్మి ముందడుగేస్తే నీ బతుకంతేరోయ్’ అనే పల్లవితో.. భాస్కర్ రాసిన పాటను ‘జబర్దస్త్’ ఫేం ‘రచ్చ రవి’ పాడగా రికార్డ్ చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల`నిర్మాత కిషోర్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘‘ఓ నలుగురు స్నేహితుల కథ ఇది. ఈ నలుగురిలో ముగ్గురు నిలువెత్తు స్వార్ధపరులైతే.. మిగతా ఒక్కడు మాత్రం సమాజానికి తన వంతు సేవ చేయాలని తపించే వ్యక్తి. తన వల్ల సమాజానికి వీలైనంత మంచి చేయాలని తపించే తమ మిత్రుడు అనూహ్య రీతిలో ఓ రాజకీయ నాయకుడి వల్ల ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు... స్వతహా స్వార్ధపరులైన మిగతా ముగ్గురు మిత్రులు ఏవిధంగా స్పందించారు? తమ స్నేహితుడికి వారు ఏవిధంగా సహాయపడ్డారు? ఆ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అన్నది స్థూలంగా కథ. కథపై కంటే.. కథనంపై గల నమ్మకంతో ‘చోరి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ముందుగా పాటల రికార్డింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత సెట్స్కు వెళ్లాలనే సంకల్పంతో పాటల రికార్డింగ్తో సినిమాను స్టార్ట్ చేసాం. పలువురు సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్, పాటలు: భాస్కర్, రీ`రికార్డింగ్: విక్కీ, నిర్మాత: కిషోర్ కౌశిక్, కథ`స్క్రీన్ప్లే`సంగీతం`దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల!!