25 July 2018
Hyderabad
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం `బ్రాండ్ బాబు`. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ, మురళీశర్మ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా
హీరోయిన్ ఈషారెబ్బా పాత్రికేయులతో మాట్లాడుతూ ....
``ప్రతి చిన్న విషయానికి బ్రాండింగ్నే చూసుకునే హీరో, అతని ఫ్యామిలీకి.. ఓ ఇంట్లో పనిమనిషిగా చేసే నాకు మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయి? ఎలా అధిగమించాం? అనేదే కథాంశం. మారుతిగారు మంచి ఎంటర్టైనింగ్గా కథను రాశారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్, సెంటిమెంట్, రొమాన్స్ అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. హీరోయిన్గా మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే హీరోయిన్గా నిలదొక్కుకుంటున్నాను. `బ్రాండ్బాబు` సినిమా విషయానికి వస్తే.. మారుతిగారు కథ చెప్పినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయింది. అందుకనే చేయడానికి ఒప్పుకున్నాను. పనిమనిషి పాత్ర కాబట్టి.. డైరెక్టర్ ప్రభాకర్గారినిక ఫాలో అయిపోయాను. అలాగే మా ఇంట్లో పనిచేసే పనిమనిషిని కూడా అబ్జర్వ్ చేశాను. ఎన్టీఆర్గారితో 'అరవింద సమేత' చిత్రంలో నటిస్తున్నాను. నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అంత కంటే ఆ సినిమా గురించి చెప్పలేను. ఇక హీరో సుమంత్ శైలేంద్రకి ఇది తెలుగులో తొలి సినిమా కావచ్చు. కానీ.. నటన తనకు కొత్తేం కాదు. సెట్స్కి వచ్చే ముందు బాగా ప్రిపేర్ అయి వచ్చేవాడు. ఇక నేను తెలుగు అమ్మాయినే కాబట్టి డైలాగ్ డెలివరీలో ఇబ్బంది పడలేదు. ఆగస్ట్ 3న విడుదలవుతున్న ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎన్టీఆర్గారితో 'అరవింద సమేత' సినిమాతో పాటు సుమంత్గారి సినిమాలో నటిస్తున్నాను'' అన్నారు.