27 September 2014
Hyderabad
తారా నీలు కార్పోరేషన్ పతాకంపై యం.యస్ .బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి లో పాల్గొన్న రౌడీలను ప్రధాన తారాగణంగా పెట్టి ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో 5 పాటలు ఉండగా చివరి పాటను స్వేతా వర్మ గబ్బర్ సింగ్ గ్యాంగ్ మీద రెండు రోజుల పాటు షామీర్ పేటకు సమీపంలో గల ఫారెస్ట్ రిడ్జిలో ఆండ్రూస్ పాల్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. ఈ పాటతో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దర్శకుడు యం.యస్.బాబు మాట్లాడుతూ గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి లో పాల్గొన్న రౌడీ టీమును తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాలో కథ విషయానికి వస్తే రౌడీలలో మార్పుతేవడం కోసం వారికి పోలీస్ ఉద్యోగాలు ఇచ్చి వారిని కొండవీడు పోలీస్ స్టేషన్ కు పంపితే వారి ఉద్యోగ ధర్మాన్ని ఎలా నిర్మర్తించారు. సంఘ విద్రోహ శక్తుల ఆట ఎలా కట్టించారు అనేది ఈ సినిమాలో వినోదంగా చూపిస్తున్నాము..ఒక సీరియస్ కథను మేము కామెడీని రంగరించి చెపుతున్నాము .. సినిమాలో పాటలు, ఫైట్లు అన్నా ఉన్నాయి. ప్రస్తుతం సినిమా ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. ఇందులో షకీల ఫైనాన్స్ పెంటమ్మగా ఒక వినోద భరితమైన పాత్ర చేసింది. సెప్టెంబర్ నెలలో ఆడియోనువిడుదల చేసి అదే నెలలో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
సహ నిర్మాత ఎస్.కె. మక్బుల్ మాట్లాడుతూ మా దర్శకుడు ఒక మంచి కథను తీసుకుని దానికి హిలేరియస్ కామెడీని జోడించి సినిమాను చాలా బాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ గ్యాంగ్ వేసిన గెటప్ లు చూస్తేనే ..విరగబడి నవ్వుతారు. ఈ సినిమాలో పాటలు కూడా వినోదభరితంగా ఉంటాయి అన్నారు.
గబ్బర్ సింగ్ గ్యాంగ్ నటిస్తున్న ఈ సినిమాలోని మిగిలిన పాత్రల్లో మానస్, స్వేత వర్మ, అలీ తదితలరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఫోటో గ్రఫి ః గిరి దోసాడ, సహ నిర్మాతః యస్.కె. మక్బుల్, కథ, మాటలు, పాటలు, సంగీతంః నిర్మాతః దర్శకత్వంః యం.యస్.బాబు.