pizza
క్రేజీ మీడియా ప్రొడక్షన్ నం. 1 పతాకంపై 'సీక్వెల్ ఆఫ్ గీతాంజలి'
You are at idlebrain.com > news today >
Follow Us

17 December 2014
Hyderabad

అంజలి కథానాయికగా రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన 'గీతాంజలి' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. క్రేజీ మీడియా ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రాన్ని చినబాబు నిర్మించనున్నారు.

అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ - "నాకెంతో నచ్చిన చిత్రం 'గీతాంజలి'. ఆ చిత్రదర్శకుడు రాజ కిరణ్ లో మంచి దర్శకుడు ఉన్నాడు. ఆయన పని తీరు నచ్చి, ఓ చిత్రం చేయాలనుకున్నాను. అయితే వేరే కథతో కాకుండా 'గీతాంజలి' కథతోనే సినిమా చేయాలనుకుని, ఆయన్ను కలిశాను. రాజ కిరణ్ కూడా ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తారాగణం కూడా భారీగానే ఉంటుంది. ఓ ప్రముఖ కథానాయిక, కథానాయకుడు ఇందులో నటిస్తారు'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాస్ వెలిగొండ, కెమెరా: రవి (కన్నడ చిత్రం 'ఉగ్రం' ఫేం), కథ-దర్శకత్వం: రాజ కిరణ్, నిర్మాత: చినబాబు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved