02 October 2014
Hyderabad
శ్రీ గోగిశెట్టి క్రియేషన్స్ పతాకం పై స్వీయ దర్శకత్వంలో మాదాల కోటేశ్వర్ రావు రూపొందించిన చిత్రం ''గులాబి ''. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా అందుకుంది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . మాదాల హరికృష్ణ ,గోగిశెట్టి సునీల్ ,ప్రదీప్ రెడ్డి ,అలేఖ్య ,శ్రీజ ,రూప ,మహేష్ ,శ్రీధర్ రెడ్డి ,ఎఫ్ ఎం బాబాయ్ ,డా . మధు బాబు ,భాస్కర్ రాజు ,మహంతి తదితరులు నటించిన ఈ చిత్రానికి పవన్ శేష సంగీతం అందించారు . ఈ సందర్భంగా దర్శక నిర్మాతమాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ ''మా సినిమా చాలా బాగా వచ్చింది విడుదలకు సిద్దమైంది . సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మంచి చిత్రాన్ని నిర్మించారని అభినందించారు . ప్రస్తుతం నిర్భయ భారతంలో , అభాగ్య నగరం లో జరుగుతున్న సంఘటనల సమాహారమే మా గులాబీ చిత్రం . సత్వర న్యాయం జరగాలనేది మా కాన్సెప్ట్ . తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను . పవన్ శేష అందించిన సంగీతం అందరినీ అలరిస్తోంది, సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు . సహనిర్మాత భాస్కర్ రాజు మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది ,కృష్ణ వంశీ కి మొదటి చిత్రం గులాబీ మంచి హిట్ అయ్యింది ,అలాగే మా కోటికి కూడా ఇది మొదటి సినిమా పాటలు కూడా బాగా ఉన్నాయి .కంటెంట్ పరంగా కూడా చాలా మంచిది కావడంతో తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకముందన్నారు, ప్రస్తుతం సమాజం లో జరుగుతున్న వాటినే సినిమా గా రూపొందించాం నేరం చేసిన వాడికి శిక్ష కూడా అంతే ఖటినంగా ఉండాలి అది సత్వర న్యాయం జరిగేలా ఉండాలనేదే మా కాన్సెప్ట్ అని అన్నారు.