03 October 2018
Hyderabad
నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం `బేవర్స్`. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాసం సమర్పణలో ఎస్.ఎస్.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ హర్షిత మీడియాతో ముచ్చటించారు.
``మాది జైపూర్. తెలుగులో నాకు నాలుగో చిత్రం. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్గారు సీనియర్ లెజండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నాకు షూటింగ్ సమయంలో చాలా హెల్ప్ చేశారు. హీరో సంజోష్గారు చాలా సరదా మనిషి. ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించమని చెప్పే అమ్మాయి పాత్రలో కనపడతాను. కథ, దర్శకత్వం చాలా బాగా కుదిరాయి. రమేష్ చప్పాలగారు చాలా బాగా కష్టపడ్డారు. ఈ చిత్రంలో సంజోష్ హీరో బేవర్స్. ఏ పనీ పాట లేకుండా తిరిగే క్యారెక్టర్ తనది. నాకు ఒక యాక్టర్గా అన్ని రకాల పాత్రలను పోషించడం ఇష్టం. ఈ చిత్రం ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. తెలుగులో నా ఫేవరెట్ హీరో రవితేజ, పవర్స్టార్ పవన్కళ్యాణ్ ఎప్పటికైనా కుదిరితే వాళ్ళతో నటించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను. ప్రొడ్యూసర్ పొన్నాల చందుగారు చాలా మంచి వారు ఎప్పుడూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవారు. వాళ్ళ ఫ్యామిలీమెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను ఇంకా ఏ చిత్రానికి సైన్ చెయ్యలేదు. ఈ చిత్రం విడుదలయ్యాక దాని రెస్పాన్స్ చూసి డిసైడ్ అవుతాను`` అన్నారు.