|
25 June 2018
Hyderabad
హోమానంద్, పావని నాయకానాయకలుగా నటించిన చిత్రం `మిస్టర్ హోమానంద్`. జై రామ్ కుమార్ దర్శకత్వంలో ఓం తీర్థం ఫిల్మ్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 29న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో హోమానంద్ పాత్రికేయులతో మాట్లాడుతూ `` నాన్నగారు కేశవ తీర్థ.. ఆయన బెజవాడ పోలీస్, అతడెవరు, అరె సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సహకారంతోనే నేను హీరోగా ఎంట్రీ ఇచ్చాను. నేను బి.బి.ఎ చదివాను. ముందు షార్ట్ ఫిలిమ్స్ చేద్దామని అనుకున్నాను. ఆ విషయం నాన్నగారికి తెలిసింది. సినిమాల్లో నటించడానికి ఆసక్తి ఉందా? అని అడిగారు. నేను ఆసక్తి ఉందని చెప్పడంతో ఆయన సపోర్ట్ చేశారు. సత్యం యాదిగారి వద్ద నటనలో శిక్షణ తీసుకన్నాను. ఇక సినిమా విషయానికి వస్తే.. హీరో తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. అతనిక ఇల్లు కొనాలనే కోరిక ఉంటుంది. దాని కోసం హీరో పిసినారిగా మారిపోతాడు.ఇల్లు కొన్న తర్వాత అందులో ఓ దెయ్యం ఉంటుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడనే ఓ క్యారెక్టర్ నుండి వచ్చే కామెడీతో సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హారర్ కామెడీగా సినిమా అందరినీ మెప్పిస్తుంది. నటుడిగా తొలి సినిమాతో సినిమా రంగం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. సుకుమార్గారు, మారుతిగారి ప్రొడక్షన్స్లో హీరోగా నటించడానికి చర్చలు జరుగుతున్నాయి`` అన్నారు.
|
|
|
|
|
|