సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం 'తేజ్`...` ఐ లవ్ యు` ఉపశీర్షిక. సినిమా జూలై 6న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.కరుణాకరన్ ఇంటర్వ్యూ...
సక్సెస్ రెస్పాన్స్....
- సినిమా రిలీజై ఒకరోజు అవుతుంది. సినిమా సక్సెస్ గురించి అందరూ ఫోన్స్ ద్వారా.. నేరుగా కలిసి అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.
ఇన్స్పిరేషన్ లేదు...
- తేజ్ ఐల లవ్ యు కథను తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో మెమొరీ లాస్ అనే కాన్సెప్ట్ ఓ ట్రాక్లాగా తీసుకున్నాను. ఇందులో మెయిన్ కథాంశంగా తీసుకుని స్టోరీ రాసుకున్నాను. డార్లింగ్లో లవ్ స్టోరీలో ఫస్టాఫ్ అంతా అబద్ధం అనేది ఓ ప్యాట్రన్. అలాగే ఈ సినిమాలో అమ్నీషియా అనే కాన్సెప్ట్ను బేస్ చేసుకుని కథ రాసుకున్నాను.
interview gallery
అవన్నీ సినిమాలో ముఖ్యం...
- సినిమా అంటే సెలబ్రేషన్. అందులో మంచి విజువల్, మంచి సంగీతం, మంచి రొమాన్స్ అన్నీ ఉండాలి. గోపీసుందర్గారు సినిమాకు అద్భుతంగా సినిమా చేశారు. అలాగే అండ్రూగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.
రెండింటికీ తేడా..
- తొలిప్రేమలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ చివరి వరకు ఒకరికొకరు చెప్పుకోరు. కానీ సినిమాలో ఒకరికొకరు తమ ప్రేమను చెప్పుకుంటారు. అక్కడ వచ్చిన సమస్యను అధిగమించి ఇద్దరు ఎలా కలుసుకున్నారనేదే సినిమా. నేను చేసిన సినిమాలను తొలిప్రేమతో కంపేర్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల నాకు భయం వేస్తుంది.
హీరో, హీరోయిన్ గురించి...
- సాయిధరమ్, అనుపమ ఇద్దరూ పాత్రల్లో జీవించారు. వారి నటనే నా సినిమాకు ప్రాణం పోసింది.