త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన చిత్రం 'అఆ'. జూన్ 2న విడుదలైన ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, డిస్టి్రబ్యూటర్ దిల్ రాజు తన సంతోషాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
దిల్రాజు మాట్లాడతూ``అఆ చిత్రాన్ని నైజాంలో డిస్టి్రబ్యూట్ చేశాను. సినిమా విడుదలైన రోజు నుండే సూపర్హిట్ టాక్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నితిన్ కెర్లోనే టాప్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. సాధారణంగా జూన్ మొదటివారంలో సినిమాలు తక్కువగా విడుదలవుతాయి. స్కూల్స్ ఓపెనింగ్ కావడంతో పెద్దగా సినిమాలు చూడరని అందరూ అనుకుంటారు. కానీ అఆ సినిమా విషయానికి వస్తే సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. 5రోజుల్లోనే పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. అలాగే ఓవర్సీస్లో కూడా రెండు మిలియన్స్కు దగ్గరవతుంది. నితిన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో సక్సెస్ కొట్టినా అఆ చిత్రం తనకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. పంపిణీదారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్ర నిర్మాత, నా స్నేహితుడైన చినబాబుగారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు ఎ టు జెడ్ అంతా త్రివిక్రమ్ గారే. నా అనుభవాన్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం ఆరవై కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందనిపిస్తుంది. ఓ స్టార్ హీరో రేంజ్లో కలెక్షన్స్ రావడం ఆనందంగా ఉంది. రాయుడు, అఆ, సుప్రీమ్ ఇలా అన్నీ సినిమాలు పంపిణీదారుడుగా, నిర్మాతగా మంచి విజయాలు సాధించడం ఆనందంగా ఉంది. మళ్లీ సక్సెస్దారిలోకి వచ్చినట్టయ్యింది. స్టార్ డైరెక్టర్స్ అప్ కమింగ్ హీరోస్తో ఇలాంటి సినిమాలు చేస్తే వండర్స్ క్రియేట్ చేయవచ్చు. ఈగ, మర్యాదరామన్న చిత్రాలు అలా వండర్స్ క్రియేట్ చేసినవే. అలాగే దర్శకుడు త్రివిక్రమ్తో నాకు నువ్వేకావాలి సినిమా నుండి మంచి పరిచయం ఉంది. అఆ రిలీజ్కు ముందే నాకు, త్రివిక్రమ్కు మధ్య ఓ సినిమా డీల్ కుదిరింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నా బ్యానర్పై ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాం. ఒకటి, రెండు నెలల్లో ఆ సినిమా వివరాలు తెలుస్తాయి`` అన్నారు.