12 August 2017
Hyderabad
బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'జయజానకినాయక'. బోయపాటి శ్రీను దర్శకుడు. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి సినిమా గురించి పాత్రికేయులతో మాట్లాడారు.
మిర్యాల రవీందర్రెడ్డి మాట్లాడుతూ..''సినిమాపై నమ్మకంతోనే ముందుకు సాగాం. విడుదలైన తొలి ఆట నుండి సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. అల్లు అరవింద్గారు ఫోన్ చేసి 'సినిమాపై నమ్మకంతో మంచి సినిమా చేశావ్, నీకు మంచి భవిష్యత్ ఉంది' అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇది తన జీవితంలో గుర్తుండే పోయే సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నాడు. తన ఆనందానికి హద్దులేవ్. బోయపాటిగారు యాక్షన్ సీన్స్ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. యాక్షన్ సీన్స్ ఎంతో భావున్నాయని అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. నేను ఆర్టిస్టుల కంటే టెక్నిషియన్స్ను బాగా నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాను.
Producer Miryala Ravinder Reddy interview gallery |
|
|
|
దేవిశ్రీప్రసాద్ అందించిన రీ రికార్డింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లింది. ఓవర్సీస్లో చాలా మంచి టాక్ వచ్చింది. కలెక్షన్స్ పెరుగుతున్నాయి. భవిష్యత్లో తీయబోయే ప్రతి సినిమాను కథను బట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాను. కథను నమ్మే సినిమాలు చేస్తాను. బోయపాటిగారితో త్వరలోనే సినిమా చేసే అవకాశం ఉంది. రెండు మూడు సినిమాలు డిస్కషన్స్లో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను'' అన్నారు.