మా పూర్వీకులు కన్నడిగులు. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే అని అంటోంది నిత్యాశెట్టి. ఆమె నటించిన పడేసావె త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిత్యాశెట్టి సోమవారం విలేకరులతో మాట్లాడింది
* మీ గురించి చెప్పండి?
- చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 22 సినిమాలు చేశా. అందులో ఒకటి ఫారిన్ సినిమా. మిగిలినవన్నీ తెలుగు సినిమాలే. హీరోయిన్గా ఇదే నా తొలి సినిమా.
* హీరోయిన్ కావాలని చిన్నప్పుడే అనుకున్నారా?
- అలాంటిదేం లేదండీ. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇన్ఫొసిస్లో చేరా. కానీ అక్కడ నాకు జాబ్ శాటిస్ఫేక్షన్ లేదు. అందుకే వచ్చేశాను.
* చిన్నప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటి?
- అప్పుడు అందరూ చాక్లెట్లు ఇచ్చి పేంపర్ చేసేవారు. ఇప్పుడేమో తినొద్దని ఒకటే గొడవ.
* ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించారా?
- నేను ఆడిషన్కి వెళ్లినప్పుడే సెకండ్ హీరోయిన్ అయితే వద్దనుకున్నా. అయితే చునియా చాలా వివరంగా చెప్పింది. ఇందులో తొలి, రెండో హీరోయిన్లని ఉండరని కూడా వివరించింది. మూడు లీడ్ కేరక్టర్లే ఉంటాయని చెప్పింది. తను చాలా డెడికేటివ్. వర్క్ పట్ల తను ఎంత సిన్సియర్గా ఉంటుందో చూసి ఆశ్చర్యపోయా.
Nithya Shetty interview gallery
* సినిమా గురించి చెప్పండి?
- అందమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ.
* మీకు నచ్చిన హీరో ఎవరు?
- నాగార్జునగారంటే చాలా ఇష్టం.
* ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు?
- మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఉంది. అలాగని అవార్డు పిక్చర్స్ కాదు.
* మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
- తమిళంలో కాదల్ కాలమ్ అనే సినిమా విడుదలకుంది. తెలుగులో శోభన్ బాబు అనే సినిమా చేస్తున్నా.