19 February 2018
Hyderabad
రంజిత్, పాలక్ లల్వానీ జంటగా 'దిక్కులు చూడకు రామయ్య' ఫేమ్ త్రికోటి పేట దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం 'జువ్వ'. ఎస్.వి. రమణ సమర్పణలో సొమ్మి ఫిలింస్ పై డా. భరత్ సోమి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 23న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాలక్ లల్వానీతో పాత్రికేయులతో సినిమా గురించి మాట్లాడుతూ - ``'అబ్బాయితో అమ్మాయి' సినిమా తర్వాత దర్శకుడు త్రికోటిగారు నన్ను ఈ సినిమా కోసం సంప్రదించారు. కథ వినగానే బాగా నచ్చింది. ఈ సినిమాను ఏడాది క్రితమే స్టార్ట్ చేశారు. సినిమా పూర్తి కాగానే జి.వి.ప్రకాష్తో ఓ సినిమాను, 'కేరింత' ఫేమ్ విశ్వాంత్తో మరో సినిమాను కూడా పూర్తి చేశాను. వాటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'జువ్వ'లో నెక్స్ట్ డోర్ అమ్మాయిగా కనపడతాను. సింపుల్గా ఉంటుంది. హీరో రంజిత్ మంచి కోస్టార్. సినిమా ప్రారంభం నుండి పూర్తి అయ్యేటప్పటికీ పెర్ఫార్మెన్స్ పరంగా ఎంతో ఇంప్రూవ్ అయ్యాడు. నా తొలి సినిమా 'అబ్బాయితో అమ్మాయి' మూవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని రాబట్టుకోలేదు. అయితే దాని ఎఫెక్ట్ నాపై పడలేదు. జయాపజయాలు నటులపై ప్రభావాన్ని చూపవని అనుకుంటాను. అనుష్కశెట్టి, సాయిపల్లవి చేసేటువంటి డిఫరెంట్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ను చేయాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం నేను ప్రారంభ దశలోనే ఉన్నాను. హీరోయిన్గా మంచి పోజిషన్ చేరుకున్న తర్వాత మంచి పాత్రలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నా దర్శకులను నమ్మే సినిమాలు చేస్తున్నాను'' అన్నారు.