pizza
Tatineni Satya interview about Veedevadu
'వీడెవడు' సచిన్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చే చిత్రమవుతుంది - తాతినేని సత్య
You are at idlebrain.com > news today >
Follow Us

14 September 2017
Hyderabad

సచిన్‌, ఈషాగుప్తా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'వీడెవడు'. వైకింగ్‌ మీడియా అండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలవుతుంది. ఈ సందర్బంగా దర్శకుడు తాతినేని సత్యతో సినిమా గురించి మాట్లాడుతూ...'' నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ రీమేక్‌ చిత్రాలే. 'వీడెవడు' నా తొలి స్ట్రయిట్‌ మూవీ. ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి చెప్పాలంటే సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమే 'వీడెవడు'. సినిమాలో హీరో భార్యను ఎవరో హత్య చేస్తారు. ఆ నేరం హీరోపై పడుతుంది. ఇంతకు ఆ హత్యను ఎవరు చేశారనేదే కథ. హీరో ప్రొ కబడ్డీ ప్లేయర్‌. కబడీని వైల్డ్‌గా ఆడుతుంటాడు. అసలు హీరో క్యారెక్టర్‌ ఎంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ముందు ఈ సినిమాకు సంబంధించిన లైన్‌ మాత్రమే నా మైండ్‌లో ఉంది. అప్పటికింకా పూర్తి కథను సిద్ధం చేయలేదు. సచిన్‌జోషిని కలిసినప్పుడు థ్రిల్లర్‌కి క్రైమ్‌ను మిక్స్‌ చేసి కథను సిద్ధం చేయమని అన్నారు. అప్పుడు కథను సిద్ధం చేశాను. సినిమా బౌండ్‌ స్క్రిప్ట్‌ తయారుచేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఆ తర్వాత తమిళంలో కూడా చేస్తే బాగుంటుందని నటులను మార్చి అందులో కూడా చేసేప్పటికి సమయం పట్టింది. సినిమా అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. సచిన్‌ జోషిగారికి మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నాను. కచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. తదుపరి సినిమాలంటే ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. ఎందుకంటే పలానా వాళ్లతోనే చేయాలని ఖచ్చితంగా అనుకోలేదు. రీసెంట్‌గా హీరో నానికి పొలిటికల్‌ డ్రామా కాన్సెప్ట్‌తో ఓ లైన్‌ చెప్పాను. కాబట్టి నా నెక్స్‌ట్‌ మూవీ నానితో చేయవచ్చు'' అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved