నారా రోహిత్ హీరోగా నటించిన `శంకర` అక్టోబర్ 21న విడుదల కానుంది. రెజీనా నాయికగా నటించారు. తాతినేని సత్య ప్రకాశ్ దర్శకత్వం వహించారు. శ్రీ లీలా మూవీస్ పతాకంపై రూపొందింది. జె.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్తో కలిసి ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) నిర్మించారు. ఎం.వి.రావు సమర్పించారు. తమిళంలో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న `మౌనగురు` చిత్రానికి రీమేక్ ఇది. అక్టోబర్ 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు తాతినేని సత్యప్రకాష్తోఇంటర్వ్యూ......
సినిమా కథ గురించి....
- నా దర్శకత్వంలో ఇంతకుముందు నానితో భీమిలి కబడ్డి జట్టు, సుధీర్బాబుతో ఎస్.ఎం.ఎస్ చిత్రాలు చేశాను. ఇప్పుడు నారారోహిత్తో చేసిన 'శంకర' నా మూడో సినిమా. స్టూడెంట్కు సంబంధించిన కథ. అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకున్న స్టూడెంట్ దాన్నుండి ఎలా భయటపడ్డాడనేదే కథ. డిఫరెంట్ మూవీ. తమిళంలో మౌనగురు సినిమాకు ఈ సినిమా రీమేక్. 'మౌనగురు' సినిమాను తెలుగులో నేను 'శంకర' అని చేస్తే, హిందీలో ఎ.ఆర్.మురగదాస్గారు 'అకీరా' అనే పేరుతో రీమేక్ చేశారు.
మార్పులు చేర్పులు చేశాం...
- నేను డైరెక్ట్ చేసిన 'భీమిలి కబడ్డి జటు'్ట సినిమాను తెలుగు నెటివిటీకి కనెక్ట్ చేస్తూ ఎలాగైతే డైరెక్ట్ చేశానో, 'శంకర' సినిమాను కూడా మన నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి డైరెక్ట్ చేశాను.
Tatineni Satya Prakash interview gallery
రెజీనా క్యారెక్టర్....
- రెజీనా శంకర చిత్రంలో డాక్టర్ పాత్ర చేసింది. హీరో పాత్రకు సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది. సమస్యల్లోని హీరోకు సపోర్ట్ చేస్తుంటుంది.
సాయికార్తీక్ మ్యూజిక్....
- సాయికార్తీక్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ అందించాడు. సినిమాలో నాలుగు పాటలున్నాయి. అన్నీ సందర్భానుసారం చక్కగా అమరాయి.
ప్రెష్ కంటెంట్....
- ప్రస్తుతం సమాజంలో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యను ఈ సినిమాలో చూపించాను. సినిమా విడుదల ఆలస్యం అయ్యిందే తప్ప కంటెంట్ చాలా ప్రెఫ్గా ఉంటుంది. తమిళం, హిందీ కంటే తెలుగులో సెకండాఫ్ విషయంలో కేర్ తీసుకుని చేశాను. 'శంకర' దర్శకుడిగా నాకు మంచి పేరుని తీసుకొస్తుంది.
తదుపరి చిత్రం....
- భీమిలి కబడి జట్టు రీమేక్, అలాగే ఎస్.ఎం.ఎస్ కూడా రీమేక్ సినిమాయే. ఇప్పుడు విడుదలవుతున్న శంకర కూడా రీమేక్ సినిమాయే. సచిన్జోషితో 'వీడెవడు' అనే సినిమా చేస్తున్నాను. తెలుగులో నేను చేస్తున్న స్ట్రయిట్ మూవీ ఇది. 'వీడెవడు' సినిమాను డిసెంబర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. వచ్చే నెల మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నాం. తమిళం, తెలుగులో సినిమా విడుదలవుతుంది. తమిళంలో 'యారివన్' అనే పేరుతో విడుదలవుతుంది. వచ్చే నెలలోనే విడుదల తేదిని అనౌన్స్ చేస్తాం. సచిన్జోషికి జంటగా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది.