వరుసగా విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని సందడి చేస్తున్న సునీల్ హీరోగా... మన్నార్ చోప్రా హీరోయిన్ గా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన జక్కన్న ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరపుకున్న జక్కన టాకీ పార్ట్ పూర్తయింది. మే లో విదేశాల్లో 3 పాటల్ని, వైజాగ్ లో రెండు పాటల్ని చిత్రీకరించనున్నారు. దీంతో మే నెలాఖరుకి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. త్వరలో ఆడియో విడుదల చేసి, జూన్ మూడవ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...... సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. ఈ చిత్రానికి జక్కన్న అనే టైటిల్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది. డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అందరినీ అలరిస్తుంది. ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులుంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ట్విస్టులుంటాయి. మే 11 నుంచి విదేశాల్లో మూడు పాటల్నిచిత్రీకరించనున్నాం. ఆ తర్వాత వైజాగ్ లో రెండు పాటల్ని చిత్రీకరిస్తాం. దీంతో మే నెలాఖరుకి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు డబ్బింగ్, ఎడిటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేసి... జూన్ మూడవ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.