24 March -2021
Hyderabad
ఎప్పటికప్పుడు సరికొత్త కథలు ఎంచుకుంటూ యూత్లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నిఖిల్, విలక్షణ కథల దర్శకుడు చందూ మెండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కార్తికేయ 2. ఏడేళ్ల కింద వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ ఇది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మాయ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ 2 షూటింగ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్లోని సిస్సులో జరుగుతుంది. హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో పాటు ఇతర నటీనటులు కూడా అక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుండటంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆపేయాల్సి వచ్చింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.
నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్ తదితరులు
టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్ప్లే-దర్శకత్యం - చందు మెుండేటి
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరి& అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కొ-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: టి.జి విశ్వ ప్రసాద్&అభిషేక్ అగర్వాల్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్