ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్పై రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'రాజా మీరు కేక'. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందదర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ``చాలా వైవిధ్యమైన కథతో తెరకెక్కించాం. సినిమాలో ఒక్క పాత్ర లేకపోయినా కథ ముందుకు నడవదు. అంటే ప్రతి పాత్రా ఇందులో అంత కీలకమైంది. నేటి సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని బేస్ చేసుకుని తీశాం. నెల్లూరులో జరిగిన ఓ వాస్తవ ఘటనను కథగా మలిచి సినిమాగా తీశాను. విలువలతో పెరిగిన కుర్రాళ్లు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఎలా `రాజా మీరు కేక` అని అనిపించుకుంటారన్నది ఆసక్తికరం. సాప్ట్ వేర్ కంపెనీలు ఎప్పుడు మూతపడుతున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. అలాంటి నేపథ్యాన్ని కూడా సినిమాలో చూపిస్తున్నాను. ఏ ఒక్క కంపెనీనో ఉద్దేశించి తీసిన సినిమా కాదు.
Krishna Kishore interviewgallery
స్నేహం, కుటుంబం, కామెడీ, థ్రిల్, అన్నీ ఇందులో ఉంటాయి. తారకరత్న సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా నటించారు. పృథ్వి, పోసాని, గుండు సుదర్శన్ చేసిన సన్నివేశాలు గొప్పగా ఉంటాయి. లాస్య పాత్ర ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగా నటించింది. శోభిత అనే పాత్రధారి కూడా చాలా బాగా నటించింది. తనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నా సినిమాను చూసి సురేశ్బాబుగారు, సాయి కొర్రపాటిగారు, కె.కె.రాధామోహన్గారు మంచి కథ ఉంటే చెప్పమని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాను చూసిన వారందరూ `రాజా మీరు కేక` అని అంటారని ఆశిస్తున్నాను`` అని చెప్పారు.