21 November 2014
Hyderabad
డిసంబర్ మొదటివారంలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఆడియో విడుదల.
సుధీర్ బాబు నందిత జంటగా చంద్రు దర్శకుడిగా వెరయిటీ ..సెన్సేషనల్ సినిమాలు తీసే రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై స్థాపించి జనవరి 21 నాటికి పది సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ సందర్భంగా వారు ఒక వైవిద్యమైన కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఆ చిత్రమే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.ఈ సినిమా షూటింగ్ పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ మొదటి వారంలో సినిమా ఆడియోను విడుదల చేసి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శిరీష .శ్రీధర్ లు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి అయితే వాటి అన్నింటికి భిన్నంగా మేము ఓ సినిమాను రూపొందించాలని తలపెట్టాము.. దాని ఫలితమే ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా .. ఈ సినిమాను పోల్చ వలసి వస్తే గతంలో తెలుగు లో వచ్చిన మరో చరిత్ర హిందీలో వచ్చిన ప్రేమ పావురాలు సినిమా స్థాయిలో ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు చంద్రు కన్నడలో ఎంతో పేరు ఉన్న దర్శకుడు.. అతడు అక్కడ వరస విజయాలను అందించాడు. ఈ చిత్రం సంగీతం గురించి చెప్ప వలసి వస్తే ఆదిత్యా మ్యూజిక్ వారు మామూలు రేటు కంటే పదంతలు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంగీతాన్ని తాము చేస్తే నే బాగుంటుంది. ఈ చిత్ర దర్శకుడు హరి ఎ.ఆర్. రెహమాన్ అంతటి స్థాయిలో సంగీతాన్ని అందించాడు అని వారు కొనియాడారు. ఈ సినిమా సంగీతం పరంగా సినిమా పరంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం మాకు ఉంది. మా బేనర్ స్థాపించి పదేండ్లు కావస్తున్న సందర్భంగా ఈ సినిమా మంచి విజయాన్ని సంపాదించి పెడుతుందని ఆశిస్తున్నాము అన్నారు.