12 August 2014
Hyderabad
“ అంతకు ముందు ఆ తరువాత” లాంటి సూపర్ హిట్ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేఖ స్థానం సంపాయించిన సుమంత్ అశ్విన్ హీరోగా , ” ప్రేమకథా చిత్రం “ లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత నందిత హీరొయిన్ గా , మాయాబజార్ మూవీస్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి , మహేంద్ర బాబు లు కలసి నిర్మిస్తున్న చిత్రం లవర్స్.. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి కథ, మాటలు అందించటమే కాక సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. హరి చిత్ర దర్శకుడు. జే.బి అందించిన సంగీతం ఇప్పటికే మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. ఇటీవలే ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వాతంత్ర దినోత్సవం సందర్భం గా ఆగష్టు 15 న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భం గా నిర్మాతలు మాట్లాడుతూ..” అంతకుముందు ఆ తరువాత చిత్రం తరువాత సుమంత అశ్విన్, ప్రేమకథ చిత్రం తరువాత నందిత లు జంట గా , హరి దర్శకత్వం లో మాసంస్థ మాయాబజార్ మూవీస్ పై వైవిధ్యమైన లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న చిత్రం లవర్స్.. ఈ చిత్రం లో నందిత , సుమంత్ అశ్విన్ ల మధ్య వచ్చ్చే సన్నివేశాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి అంతే కాదు చక్కటి వినోదాన్ని పుట్టిస్తాయి. ఇటీవలే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న షామిలి అండ్ తేజస్విని లు చాలా చక్కటి పాత్రల్లో నటించారు. మారుతీ ఈ చిత్రానికి సమర్పకుడు అంతేకాకుండా కథ, మాటలు కూడా అందించారు. మారుతీ రాసిన మాటలు హీరో సుమంత్ నోట పలకటం ధియేటర్ లో విజిల్స్ పడేలా ఉంటాయి. దర్శకుడు హరి టేకింగ్ ప్రత్యేఖం గ ఉంటుంది. ఈ సినిమా తో ఆయన మంచి దర్శకుల లిస్టు లోకి చేరతారు. అంతే కాదు మా లవర్స్ సినిమా లో చివరి అరగంట లో వచ్చే సప్తగిరి పాత్ర చాలా వినోదాన్ని అందిస్తుంది. మా లవర్స్ సినిమా యువత ని ఆకట్టుకోవటమే కాకుండా ఫ్యామిలీ అంతా చక్కగా నవ్వుకునేలా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగష్టు 15 న విడుదల చేస్తున్నాము” అని అన్నారు.