pizza
Lucky Media banner's NENU NAA BOYFRIENDS
హెబ్బా పటేల్ నాయికగా లక్కీ మీడియా పతాకంపై 'నేను-నా బాయ్ ఫ్రెండ్స్'
You are at idlebrain.com > news today >
Follow Us

14 March 2016
Hyderaba
d

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇటీవల వచ్చిన 'సినిమా చూపిస్త మావ' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తమ సంస్థ ప్రతిష్టను మరింత పెంచిందనీ, తదుపరి చిత్రం కూడా ఆ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నానని బెక్కెం వేణుగోపాల్ అన్నారు.

దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా బెక్కెం వేణుగోపాల్ ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రవిశేషాలను బెక్కెం వేణుగోపాల్ చెబుతూ - "దాదాపు ఏడాదిగా ఈ కథ కోసం కసరత్తులు చేశాం. ఇది యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మంచి థ్రిల్లింగ్ మూవీ ఇది. ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తాం'' అని చెప్పారు.

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved