7 December -2020
Hyderabad
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మహాసముద్రం'. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఇండస్ట్రీ సర్కిల్స్లోనూ, ప్రేక్షకుల్లోనూ దానిపై అమితమైన క్రేజ్ వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
సోమవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా డైరెక్టర్ అజయ్ భూపతి ప్రకటించారు. మహాసముద్రం టైటిల్ పోస్టర్తో పాటు, సెట్స్పై తాను పర్యవేక్షించే మానిటర్ పిక్చర్ను షేర్ చేసిన ఆయన, "ఈ ఉద్రేకభరిత లవ్ స్టోరీని, అసాధారణ క్యారెక్టరైజేషన్స్తో కూడిన ఇంటెన్స్ డ్రామాను చూపించడానికి కుతూహలంతో ఎదురుచూస్తున్నాను. ఇలాంటిది మీరెప్పుడూ అనుభవించి ఉండరు! తప్పకుండా మీరు దీన్ని ప్రేమిస్తారు. ఈరోజు షూటింగ్ మొదలుపెట్టడానికి సంతోషిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
హీరో సిద్ధార్థ్ సైతం తన ఆనందాన్ని పంచుకున్నారు. తన పెట్ డాగ్ నోరితో దిగిన ఫొటోను షేర్ చేసిన ఆయన, "'మహాసముద్రం' మొదలవుతోంది. నేను ఓ డిఫరెంట్ కథకు వెళ్తున్నా. నా బేబీ నోరి తన డాడీకి బై చెబుతోంది. పంచుకోవడానికి చాలా ఉన్నాయి. టచ్లో ఉంటే చెప్తా." అని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్లో రాసుకొచ్చారు.
ఈ మూవీలో అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.
రాజ్ తోట సినిమాటోగ్రాఫర్గా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటర్గా, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
సహ నిర్మాత: అజయ్ సుంకర
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్.
యాక్షన్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్