ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం `మనలో ఒకడు`. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా నటించారు. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా....
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ `` `మనలో ఒకడు`పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవల తిరుపతిలో వన్ మిలియన్ క్లిక్స్ డిస్క్ ఫంక్షన్స్ నిర్వహించాం. థియేట్రికల్ ట్రైలర్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా `మనలో ఒకడు` కథను రాసుకున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణమూర్తి అనే అధ్యాపకుడి పాత్రలో నటించాను. పవర్ఫుల్ పాత్ర అది. డైలాగ్ కింగ్ సాయికుమార్గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మనలో ఒకడు` సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అని అన్నారు.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ``ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలకు, థియేట్రిలక్ ట్రైలర్కు చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్ 4న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని చెప్పారు.