పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్లో నిర్మిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తయింది. నవంబర్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నవంబర్లో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. వసంత్ చేసిన మ్యూజిక్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది'' అన్నారు.