'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్టైగర్'వంటి సూపర్హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్లో నవీన్చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తయింది.
అక్టోబర్ 19న ఆడియో ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సత్తిబాబు, నవీన్చంద్ర కాంబినేషన్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్ని అందించే హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. సత్తిబాబు చాలా ఎక్స్ట్రార్డినరీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీవసంత్ అందించిన మ్యూజిక్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వుంది. అక్టోబర్ 19న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ చివరి వారంలోగానీ, నవంబర్ మొదటి వారంలోగానీ వరల్డ్వైడ్గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాస్ చేస్తున్నాం'' అన్నారు.