pizza
Musugu in Censor work
సెన్సార్‌ కార్యక్రమాల్లో 'ముసుగు'
You are at idlebrain.com > news today >
Follow Us

02 March 2016
Hyderaba
d

త్రినాథ్‌ పంపన, మనోజ్‌ కృష్ణ, హర్ష కృష్ణమూర్తి, జెస్సీ, పూజశ్రీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'ముసుగు'. శ్రీకరబాబు దర్శకత్వం వహిస్తున్నారు. వేద ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై దగ్గుబాటి వరుణ్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. నిర్మాత దగ్గుబాటి వరుణ్‌ మాట్లాడుతూ ''మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రమిది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించాం. ఇటీవల గోవాలో చివరి షెడ్యూల్‌ చేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌కి అప్లై చేశాం. త్వరలో ఆ కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. ''రొమాన్స్‌, క్రైమ్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా లావిష్‌గా వచ్చేందుకు ఎంతో సహకరించారు. అవుట్‌పుట్‌ చూసి ఆయన బ్యానర్‌లో మరో సినిమా డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది'' అని దర్శకుడు శ్రీకరబాబు చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు:పాటలు: గంగోత్రి విశ్వనాథ్‌, ఎడిటింగ్‌: అనిల్‌ బొంతు, సంగీతం: నవనీత్‌చారి, సి.ఎన్‌.ఆదిత్య, స్క్రీన్‌ప్లే: దివాకర్‌ బాబు, కెమెరా- దర్శకత్వం: శ్రీకరబాబు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved