pizza
Paathshaala - a journey of 5 friends
అయిదుగురు స్నేహితుల ప్రయాణం 'పాఠశాల'
You are at idlebrain.com > news today >
Follow Us

19 June 2014
Hyderabad

'విలేజ్ లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాఫీ' చిత్రాల తరువాత 'మూన్ వాటర్' పిక్చర్స్ సంస్థ నిర్మించిన మూడవ చిత్రం ' 'పాఠశాల'.

కాలేజ్ ఆఖరి రోజున నాలుగేళ్ళుగా కలసి తిరిగిన స్నేహితులను, కాలేజ్ ని వదలలేక అయిదుగురు స్నేహితులు కలసి ఒకరి ఊరికి ఒకరు వెళ్లాలని అనుకుంటారు. స్నేహితుడి ఇంట్లో గడిపిన ఆ నాలుగురోజులు నాలుగేళ్ళుగా తెలిసిన ఆ స్నేహితు డినే కొత్తగా పరిచయం చేసింది. వాళ్లకి తెలిసిన స్నేహితుల గురించే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. పదహారేళ్ళ పాటు చదువుకున్న ప్పుడు నేర్చుకోని పాఠాలు ఆ ఒక్క ప్రయాణం లో నేర్చుకున్నారు.

ఆ ఒక ప్రయాణం నేర్పించిన పాఠాలే..ఈ 'పాఠశాల'

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై చివరి వారంలోగానీ, ఆగస్టు మొదటి వారంలో గానీ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

సాయిరోనక్, అనుప్రియ, నందు, శిరీష, హమూద్ మరియు శశాంక్, నరసింహరాజు, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం తదితరులు నటిస్తున్నారు.

సంగీతం; రాహుల్ రాజ్(ఓ మై ఫ్రెండ్), ఎడిటింగ్: శ్రవణ్.కె.: కెమెరా: సుదీర్ సురెందరన్

నిర్మాతలు: రాకేశ్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి.

రచన - దర్శకత్వం: మహి.వి.రాఘవ్


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved