25 January 2022
Hyderabad
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మ అవార్డుల పురస్కారాలను మంగళవారం ప్రకటించారు. పలు రంగాల్లో విశిష్ట సేవలను అందించిన ప్రముఖుల పేర్లను ప్రభుత్వం గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. 128 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. అందులో 4గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధే శ్యామ్ ఖేస్కూ, సీడీఎస్ బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్లకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు.
ఇక మొత్తంగా చూస్తే ఏడుగురు తెలుగువారు ఇందులో ఉన్నారు. అందులో తెలంగాణ నుంచి నలుగు, ఏపీ నుంచి ముగ్గురున్నారు. భారత బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జెఎండీ సుచిత్ర ఎల్ల .. దంపతులు వీరిద్దరికీ పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. ఇక అరుమందికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఇందులో తెలంగాణ నుంచి చూస్తే మొగులయ్య, రామ చంద్రయ్, పద్మజా రెడ్డి ఉండగా.. ఏపీ నుంచి డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు, గరికపాటి నరసింహారావు, గోసవీడు షేక్ హాసన్ ఉన్నారు.
ఇక సినిమా రంగం నుంచి చూస్తే షావుకారు జానకికి కళా రంగానికి చేసిన సేవకుగానూ తమిళనాడు రాష్ట్రం తరపున పద్మ శ్రీ అవార్డు వచ్చింది. అలాగే బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు.