వినీత్, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యానర్పై రామమోహన్.సి.హెచ్ దర్శకత్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి తన తనయుడు వినీత్ను హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా..
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘’ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాతో హీరోగా పరిచయమవుతున్న హీరో వినీత్ కమర్షియల్ హీరోగా రాణిస్తాడు. ఐదు సినిమాలు, ఐదు ఫైట్స్ తో ఫస్టాఫ్ అంతా లవ్ ట్రాక్, సెకండాప్ అంతా యాక్షన పార్ట్ తో సినిమా అంతా ఎంటర్ టైనింగ్ వేలో సినిమా రన్ అవుతుంది. అంతే కాకుండా వినీత్ తన తొలి చిత్రంలోనే నాలుగు షేడ్స్ ఉన్న రోల్ పాత్ర చేశాడు. నటన, ఫైట్స్, డ్యాన్సులు పరంగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.