21 December 2019
Hyderabad
'చిత్రలహరి' సూపర్ హిట్ తరువాత సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా, హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిన చిత్రం "ప్రతిరోజూ పండగే" నిన్న (డిసెంబర్ 20న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్ లో వచ్చే డైనింగ్ టేబుల్ సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా గిలిగింతలు పెట్టిస్తోంది.
గతంలో వచ్చిన చాలా చిత్రాల్లో డైనింగ్ టేబుల్ సీన్స్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి. అదే తరహాలో ప్రతిరోజూ పండగే చిత్రంలో సెకండ్ హాఫ్ లో వచ్చే డైనింగ్ టేబుల్ సీన్ లో చిత్రంలో నటించిన నటీనటులందరూ కూర్చుని భోజనం చేసే సీన్ లో రావ్ రమేష్, భద్రమ్ కామెడీ అంతా ఇంతా కాదు. థియేటర్ నుండి బయటికి వచ్చిన ఆడియన్స్ ఈ సీన్ ను మర్చిపోలేక పోతున్నారు. మారుతి తన దర్శకత్వ ప్రతిభతో ఈ ఎపిసోడ్ ను అందంగా చిత్రీకరించారు. ఇలాంటి మర్రిన్ని సన్నివేశాలతో ప్రతి రోజు పండగే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చెయ్యడం విశేషం.