22 January 2019
Hyderabad
ప్రియాంత్ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ `కొత్తగా మా ప్రయాణం`. యామిని భాస్కర్ కథానాయిక. `ఈ వర్షం సాక్షిగా` ఫేం రమణ దర్శకుడు. ఈ నెల 25న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రియాంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..
- నేను కంపెనీ సెక్రటరీ కోర్సు చేసి హైదరాబాద్ యస్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాన్నగారు డాక్టర్. సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను.
- సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా. నా క్యారెక్టర్ ఫేరు కార్తీక్. హీరోయిన్ యామిని భాస్కర్ పాత్ర పేరు క్తీర్తి. హీరో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నా రెండు లక్షల జీతం తీసుకుంటూ ఉంటాడు. హార్డ్ కోర్ మనస్తత్వం ఉండే వ్యక్తి హీరో. ఎదైనా ముఖం మీదే అడేగే హీరో.. హీరోయిన్ను కలిసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్లు కలిసి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారనేది సినిమా. సినిమాలో స్నేహితులుగా ఉంటారు. కానీ లివింగ్ రిలేషన్లో ఉండరు.
- సినిమాలో గ్లామర్ పార్ట్ ఉంటుంది. కానీ ఎక్కడా హద్దు దాటలేదు.
- మనుషుల మధ్య మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయనేది ప్రధానంగా సినిమా ఉంటుంది. హద్దులనేవి లేకపోవడం వల్ల సమాజం ఎలా పాడైపోతుంది. ఒక అమ్మాయి ఎలాంటి సమస్యలను ఫేస్ చేసిందనేదే కథ.
- మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కలిసి ఈ సినిమా చేశారు. కాబట్టి నటిస్తూ.. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్నాను.
- ప్రసాద్ అనే కొత్త దర్శకుడితో వచ్చే నెల సినిమా చేయబోతున్నాను. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.