pizza
Producer Radha Krishna hands over 5 lacs cheque to CM for Hudhud relief
You are at idlebrain.com > news today >
Follow Us

29 October 2014
Hyderabad

తుపాను బాధితులకు నిర్మాత రాధాకృష్ణ రూ.5 లక్షల విరాళం -

హుదూద్ తుపాను బాధితులకు ప్రముఖ నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎం.రాధాకృష్ణ రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆయన ఈ మొత్తాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను అభినందించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు తమ వంతుగా సాయం చేస్తూ ముందుకు కదిలి వస్తున్నారంటూ ప్రశంసించారు.

నిర్మాత S. రాధాకృష్ణ మాట్లాడుతూ తుపానుతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురికావడం దురదృష్టకరమన్నారు. బాధితులకు తెలుగు హీరోలు, దర్శకనిర్మాతలతో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సేవలందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని ఆయన కొనియాడారు. చంద్రబాబును కలిసిన వారిలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved