లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్పై కె.వి.దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్కుమార్ నిర్మిస్తున్న చిత్రం `సిద్ధార్థ`. సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ రాగిణి నంద్వాణి సిద్ధార్థ సినిమా గురించి విశేషాలను తెలియజేసింది.
ఈ సందర్బంగా రాగిణి నంద్వాణి మాట్లాడుతూ ..``నాది ఉత్తరప్రదేశ్లోని గుర్గావ్. అయితే ముంబైలో పెరిగాను. సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ చేశాను. శరవణస్టోర్స్ యాడ్స్లో నటించాను. సినిమాకు హీరోయిన్ కావాలని తెలియడంతో నా ఫోటోలు పంపాను. వారు నన్ను ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. సిద్ధార్థలో మలేషియాలో ఆర్.జె. పాత్రలో కనపడతాను. అలాగే నాది రెండు షేడ్స్ ఉన్న రోల్. ఒక రోల్లో బబ్లీగా ఉంటే, ఎమోషనల్గా మరో రోల్లో కనపడతాను. తెలుగు మాట్లాడటం చాలా కష్టమైంది. అయితే డైలాగ్స్ ముందుగానే తెప్పించుకుని నేర్చుకున్నాను. అలాగే ప్రామ్ప్టింగ్ సహాయంతో మేనేజ్ చేశాను. నేను ఇక్కడకు రాక ముందు తెలుగు సినిమాలను కొన్నింటిని చూశాను. మలయాళంలో, తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో విజయ్, మోహన్లాల్గారి సినిమాలో నటించాను. బేసిక్గా సిద్ధార్థ లవ్స్టోరీ విత్ యాక్షన్ బ్యాక్డ్రాప్. సాక్షిచౌదరి చాలా మంచి అమ్మాయి. నాకంటే ముందు నుండి సినిమాల్లో నటిస్తుంది. తనతో కలిసి కొన్ని సీన్స్లో యాక్ట్ చేయడం చాలా ప్లస్ అయ్యింది. అలాగే సాగర్ మంచి సహనటుడు. డేడికేటివ్ యాక్టర్. సినిమా చిత్రీకరణ సమయంలో బాగా సపోర్ట్ చేశాడు. తెలుగులో నా తొలి సినిమా ఇదే. అయితే బెస్ట్ టీంతో పనిచేశాను. ఇలాంటి సినిమాతో తెలుగులో పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.