రక్షిత్, స్వాతి జంటగా రూపొందిన చిత్రం ‘లండన్ బాబులు’. చిన్నికృష్ణ దర్శకుడు. మారుతి నిర్మాత. ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై సినిమా నిర్మితమైంది. నవంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరో రక్షిత్ సినిమా గురించిన విశేషాలను తెలియుజేస్తూ...‘‘దర్శకుడు చిన్నికృష్ణగారికి లండన్బాబులు మూడో సినిమా. తమిళ చిత్రం ‘అండవన్ కట్టైలె’కి మా చిత్రం రీమేక్. సినిమా కామెడీ, ఎమోషన్స్తో దర్శకుడు చిన్నికృష్ణగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ చూశాం. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శకుడు మారుతిగారు సినిమాను మేకింగ్లో చాలా కేర్ తీసుకుని రూపొందించారు. రెండు మూడేళ్ల క్రితమే మారుతిగారితో పరిచయం ఉంది. నేను విజయువాడలో ఇంజనీరింగ్ చదివే రోజులోసినిమాల్లో నటించాలని ఆసక్తి ఉందా? అని అడిగారు కూడా. నేను చదువు పూర్తి చేసుకున హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆయన్ను కలిశాను. అప్పుడు ఆయన ఈ సినిమాను రూపొందించే ప్రక్రియలో భాగంగా నన్ను ఎంపిక చేసుకున్నారు. విదేశాలకు వెళితే, డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవచ్చునని అందరూ అనుకుంటూ ఉంటారు ఈ కాన్సెప్ట్తో సినిమా సాగుతుంది. థ విషయానికి వస్తే, ఇది ఒక దిగువ మధ్య తరగతి యువకుడి కథ. తనకు డబ్బు చాలా అవసరమైన యువకుడు వీసా, పాస్పోర్ట్ కోసం ఏం చేశాడో, ఆ సవుయంలో ఏం జరిగింది? ఆ యువకుడు లండన్ ఎలా వెళ్లాడనేదే స్టోరీ. స్వాతిగారు ఈ సినిమాలో రిపోర్టర్ పాత్రలో కనపడతారు. స్వాతిగారు వంటి సీనియర్ నటితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. డ్యాన్స్ నేర్చుకుంటూ, డైలాగ్ డిక్షన్ కూడా నేర్చుకుంటున్నాను. సినిమాలో చేసేటప్పుడు అందులోని ఇబ్బందులు తెలిశాయి. దాని వల్ల సినిమా అంటే గౌరవం పెరిగింది. తదుపరిగా ఇంకా ఏ సినిమాలు ఒప్పుకోలేదు. మంచి కథలు వింటున్నాను. వచ్చే ఏడాది సినిమా చేసే అవకాశం ఉంది’’ అన్నారు.