15 October 2014
Hyderabad
హుదూద్ తుపాన్పై రవితేజ స్పందన 10 లక్షల ఆర్థిక సాయం
హుదూద్ తుపాన్ బాధితులకు తన వంతు అండగా ఉంటానని మాస్ మహరాజా రవితేజ తెలిపాడు. తన వంతు తక్షణ సాయంగా రూ.10 లక్షల విరాళాన్ని ఆయన ప్రకటించారు. గత నాలుగు రోజులుగా అక్కడ సంఘటనలపై మీడియాలో వస్తున్న వార్తలు చూసి తాను తీవ్ర ఆవేదనకు గురైనట్టు ఆయన తెలిపారు. అక్కడ ప్రజలకు కనీసం తాగడానికి నీరు, తినడానికి ఆహార పదార్థాలు కూడా లేక విలవిల్లాడుతున్నారని వాపోయాడు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదని ఆయన కోరుకున్నారు. బాధితులకు సాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తన సహనటులు, ప్రజలకు ఆయన తన అభినందనలు తెలిపారు. అలాగే తన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఉత్తరాంధ్ర చేరుకుని వారి వంతుగా తక్షణ సాయంతో పాటు సహాయక కార్యక్రమాల్లో పాల్గొవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.